క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 6 October 2012

హ్యేట్స్ ఆఫ్ చంద్ర బాబూ .. కీప్ ఇట్ అప్ !

చంద్రబాబు అక్టోబరు 2 న మొదలు పెట్టిన పాదయాత్ర దిగ్విజయంగా సాగుతున్నట్టు యెల్లో సిండికేట్ తెగ బిల్డప్పులు ఇచ్చేస్తుంది. చరిత్రలో ఏదైనా ఒక సారే. అది మరోసారి  దానిని ఎవడైనా కృత్రిమంగా రిపీట్ చెయ్యాలనుకుంటే అది కామెడి అయి పోతుంది.పాదయాత్ర  కూడ అంతే.

స్వాతంత్ర్య పోరాటం అన్నది ఒక్కసారే. ఏ ఎదవ వచ్చి మరో స్వాతంత్ర్య పోరాటం  కూసినా - ఏ బఫూన్ గాడు వచ్చి  మరో స్వాతంత్ర్య పోరాటం అని చెక్కిలి గింతలు పెట్టినా పప్పులు ఉడకవు.

వై.ఎస్. పాదయాత్ర మొదలు పెట్టిన నేపథ్యమే వేరు. తొమ్మిదేళ్ళ కరవు కాటకాలు -బాబు హై టెక్ బిల్డప్పులు -నేల మరిచిన కలలు -దేశ -ప్రపంచ స్థాయి ఖ్యాతి పట్ల వాంచతో పునాదిని మరిచి పోయిన వైనం.

విద్యుత్ చార్జీల పెంపు - విద్యుత్ బకాయిల వసూళ్ళ కోసం జప్తులు -క్రిమినల్ కేసులు , వ్యవసాయం దండగా అనే వ్యాఖ్య -రైతు బిడ్డలు వ్యవాసాయం మానుకోవాలని ఉచిత సలహాలు -ధర్మాసుపత్రుల్లో సైతం యూజర్ చార్జీలు వసూలు చెయ్యమన్న దివాళా కోరు తనం.

ఏదో రోజు ఏ క్లింటన్నో -బిల్ గేట్సునో సిటికి పిలిపించుకుని ఆ రోజు మాత్రం చెత్తకుండీలను బిచ్చగాళ్ళను లాగి పారేసి సీన్ చూపిన అమానుషం.

కరవును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపితే దానిని సైతం తెలుగు తమ్ముళ్ళు పంది కొక్కుల్లా మేసేసిన స్యాడిజం. కేవలం రైతు,నేత కార్మికులే కాదు -పేదవారే కాదు -మద్యతరగతి వారు సైతం తమ భవిష్యత్ మీద గ్యారంటి కోల్పోయిన చీకటి తరుణం అది.

ఏ చిన్న ఓదార్పు -ఏ చిన్నపాటి బాసట కలిగినా అటు వైపు వాలి పోయే తరుణం అది. అందుకే వై.ఎస్. పాద యాత్ర  మహా ప్రస్తానం అయ్యింది.

పోన్లే.. బాబు పాదయాత్ర రీ మేక్ సినిమాలాగన్నా ఏడ్చిందా అంటే అదీ లేదు. పాత సినిమాలోని జిష్ఠు ఏంటో పట్టుకుని రీ మేక్ చేస్తే ఏదో కొంత విజయావకాసం ఉంటుంది.

వై.ఎస్. పాదయాత్ర చేసినప్పుడు అంతకు పూర్వం ఎప్పుడూ ఆయిన సి.ఎంగా లేరు. కాని బాబు తొమ్మిదేళ్ళు సి.ఎంగా వెలగ పెట్టారు.
వై.ఎస్ తత్వమే వేరు. ఆయన విశ్వాసాలు వేరు. అవి ప్రజల గుండెలకు హత్తుకునేవి. ఆయన మనసంతా బహుజనులు ఉన్నారు. బీదా బిక్కి ఉన్నారు. ఆయనకు అత్యధికులకు ఉపాది కల్పిస్తున్నా  వ్యవసాయరంగం పట్ల ఎన లేని ఆసక్తి ,విశ్వాసం స్వానుభవం ఉన్నాయి.

బాబు ఆలోచనలే వేరు. ఆయన అను నిత్యం ఊహల్లో మునిగి తేలుతూ తమకు లేని అర్హతలను ఊహించుకుని -వాటిని ఎగ్జిబిట్ చేసుకుని దానిని క్యాష్ చేసుకోవాలనుకునే తత్వం. ఇందుకు గాను రక రకాలైన మేధావులతో కసరత్తు చేసేవారు బాబు.

వ్యక్తిత్వ వికాసం - వెళంకాయి అంటూ పై పై తళుకులను సమకూర్చుకునే ఆరాటం ఉన్నదే కాని అతను ఏ రోజూ పార్టిలోని నాయకులను సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. అదో రకమైన భ్రమల్లో బతికేసారు (కార్యకర్తల గురించి వేరేచెప్పక్కర్లేదు)

బాబు తన చుట్టూ ఒక లైమ్ లైట్ ఏర్పాటు చేసుకోవాలని తపించారే గాని ఏరోజు కూడ ప్రజల్లోకి వెళ్ళాలి -ప్రజలతో మమేకం కావాలని కోరుకోలేదు.

తిరుమల ఘాట్ రోడ్డు సంఘఠన అనంతరం సింపతి ఓట్లకు కకృత్తి పడి "కోటి వరాలు"ప్రసాదించాడే కాని అతని ప్రతి చర్య ప్రజాహిత కార్యక్రమాల్లోనుండి ప్రభుత్వాన్ని తప్పించే కుట్రలే చేసారు. మా నీరు ,విద్యా కమిటి ,వైద్య కమిటి ఇలా ఒకటి కాదు.

తమాషా ఏమంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాత్రం ఏకరవు పెట్టినా ఫర్వాలేదు. మన మాట ఈయన నోట వచ్చిందని సామాన్యుడు కాస్త దగ్గ్రరయ్యేవాడు.

కాని బాబు తామేదో స్వర్ణయుగపు పాలన అందించిన ఫీలింగుతో నాటి ప్రభుత్వ రికార్డులను ఏకరవు పెడుతున్నారు. కాని సామాన్యుడు మాత్రం " చీ చీ.. ఈడు ఒక మనిషేనా.. నాడు తప్పు చేసాను - ఇక చెయ్యను అని ఒక్క మాట కూడ చెప్పడు ఈడేం మంచి చేస్తాడు " అని చీదరించుకుంటారే తప్ప మరేమి జరగదు.

నిజానికి బాబు జగన్ పని భారాన్ని తగ్గిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండ గడుతున్నారు. నాటి తమ దుష్ప్రరిపలానను గుర్తు చేస్తున్నారు. తాను ఏమాత్రం మారలేదని -మారే అవకాశం కూడ లేదని తేట తెల్లం చేస్తున్నారు.

హ్యేట్స్ ఆఫ్ చంద్ర బాబూ .. కీప్ ఇట్ అప్ !



5 comments:

  1. కరెంటు చార్జీలు అప్పుడప్పుడు పెంచాలి.లేకుంటే ఏదో ఒక రోజు బారీగా పెంచాల్సి ఉంటుంది.వై.ఎస్.ఆర్. గొప్ప కోసం ఏళ్ళు చార్జీలు పెంచలేదు.ఇప్పుడు ఏమైంది.జనం నడ్డి విరుస్తున్నారు.ఇప్పుడు వై.ఎస్.ఆర్. ఉన్న పెంచేవాడు.

    వ్యవసాయం దండగా అనే వ్యాఖ్య
    ఎక్కడ అన్నారో చెప్పగలరా?


    ధర్మాసుపత్రుల్లో సైతం యూజర్ చార్జీలు వసూలు చెయ్యమన్న దివాళా కోరు తనం.
    వై.ఎస్ ఎం చేసాడు.ఆరోగ్యశ్రీ పుణ్యమా అని ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల సొమ్ము దోచుకునేందుకు అవకాసం ఇచ్చాడు.

    ReplyDelete
  2. 75 వేలకోట్లు కర్చు చేసారు.ఒక్క ప్రాజెక్టు అయినా కట్టార?అన్ని ఒకే సారి మొదలెట్టారు.ఎటికేటికి అంచనా వ్యయం పెరుగుతుంది తప్ప ఒక్క ప్రాజెక్టు పూర్తీ కాలేదు.కొడుకు మాత్రం కోట్లు దొబ్బడు.పరిపాలనలో బాబు ముందు ఇంకెవరు పనికి రారు.

    ReplyDelete
  3. jagan ku jail lo sambar posthunnaaro ledo...

    ReplyDelete
  4. jagan kashtalu sep 5 varake ani rasavu.mari dani sangathi enti.ante congress tdp kummakku ayyi grahalanu kuda marchaya nayana?

    ReplyDelete
  5. y all members attack on ysrcp.if all attack on ysrcp they will manage with their team.all members are said truths.but here only they post only 20 percent negitive but they didnt post 80 percent positive news.who see now sakshi news and tv.
    karuvu kalamlo koda 24 hours current only in tdp
    now prices are in sky but current in no stock.everi papam idi.
    prajala money thousends of cores in only some hands.idi evri papam.
    mana desamlo chinna tappuku mantri padavini vadilina varu vunnaru.
    now velakotllu dochukoni padavi kosam wate laga spend chestunnaru.
    minimum they not respect democrasy.

    ReplyDelete