క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 18 April 2010

మే 4 తరువాత రోశయ్యకు ఆదిష్ఠానంతో తగువ ?

వై.ఎస్. మరణానంతరం ప్రతి విషయానికి ఆదిష్ఠానం వైపు చేతులు చూపిస్తూ  అతివినయం ప్రదర్శిస్తూ వచ్చిన రోశయ్య కథ కంచికి చేరనుంది. మే 4 తరువాత రోశయ్యకు ఆదిష్ఠానంతో తగువ రానుంది. జ్యోతిష్య ప్రకారం రోశయ్యది తులా రాశి. ఈ రాశికి మే నాలుగవ తేది వరకే గురుభలం ఉంది. అదృష్ఠాన్ని సూచించే ఐదవ భావమున రాజగ్రహమగు గురు ఉన్నందున కాకతాళీయంగా పదవియోగం పట్టింది. కాని  ఈ గురువు
మే నాలుగున శతృ ,రోగ,రుణ బాధలను సూచించే ఆరో స్థానానికి రానున్నాడు. అలా వచ్చి జూలై 23 వరకు ఉంటాడు.

గురు గ్రహం ప్రభుత్వాన్ని,రాజకీయ అధికారాన్ని, హై కమాండును సూచించే గ్రహం. ఈ గ్రహం శతృ స్థానానికి చేరడం వలన  రోశయ్యకు ఆదిష్ఠానంతో తగువ  రావచ్చు. లేదా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించవచ్చు. లేదా కొత్త వివాదంలో తగులుకుని పదవీచ్యుతుడు కావచ్చు. ఇప్పటికే ఏల్నాటి శని ప్రారంభమైంది. ప్రస్తుతం మిథునం దనస్సు రాశుల్లో కేతువు,రాహువులున్నారు. దనస్సు తులకు దైర్యస్థానం. కాబట్టి కొంత దైర్యాన్ని ప్రదర్శించ వచ్చు. అయితే మిథునం తులకు 9 వ స్థానం అవుతుంది. ఇది హై కమాండును సూచిస్తుంది.ఇక్కడ కేతు ఉండటం వలన హై కమాండుకు దగ్గరగా ఉన్న  ఇతర మతస్తుల లాబితో చిక్కులు వచ్చి రోశయ్య చిక్కుల్లో పడతారు.

ఎలాగూ రోశయ్య ఎంతటి ఐరన్ లెగ్గో సోనియాజీకి ఇప్పటికే అర్థమైయ్యుంటుంది. ఇటీవల జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర విశేషాలు ఇప్పటికే ఆమెగారికి చేరే ఉంటుంది. అందుకే మంత్రివర్గ విస్తరణపై ఇంతటి తడపాటు.

కాని సోనియాజి తర్కపూరితంగా ఆలోచిస్తారని నేననుకోను. అలా ఆలోచించేవారైయ్యుంటే జగన్ ను సి.ఎం చేసేవారు. ఇప్పటికీ ఆ నిర్ణయం తీసుకుంటారని నేననుకోను అందుకే జగన్ బాబుకు నా సలహా ఒక్కటే బెటర్ లేట్ దేన్ నెవర్ ! ఎలాగో ప్రజల మద్యే ఉన్నారు. వై.ఎస్. పథకాలు ఎంతగా నీరు గారి పోయాయో సమాచారం సేకరించి పదిహేను రోజుల్లోపు చక్క దిద్దాలని అల్టిమేటం జారి చెయ్యాలి.

అలా చేసినప్పుడు ఆదిష్థాణమే బతరఫ్ చేసినా ఆనందం. లేదా పదిహేను రోజులనంతరం కొత్త పార్టి ప్రకటించేయడమే. పార్టి పేరు: కాంగ్రెస్ (వై.ఎస్.).

ఓదార్పు యాత్రను కాస్త ఎన్నికల ప్రస్తానంగా మార్చుకుంటే సరి పోతుంది. జగన్ జాగో ! రోశయ్యా భాగో !

0 comments:

Post a Comment